ఉమ్మడి జిల్లాలో బుధవారంతో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఈ నెల 28న ప్రథమ, 29న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షలు ముగిసిన ఆనందంతో ఎగ్జామ్ సెంటర్ల వద్ద కేరింతలతో సందడి చేశారు. ఇండ్లకు దూరంగా వసతి గృహాల్లో ఉంటూ చదివిన విద్యార్థులు పరీక్షలు ముగియడంతో ఇంటిబాట పట్టారు. కొందరు తల్లిదండ్రులు హాస్టళ్లకు చేరుకొని తమ పిల్లలను స్వగృహాలకు తీసుకెళ్లారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో వసతి గృహాలు, బస్టాండ్లు సందడిగా మారాయి.
-కామారెడ్డి/ ఖలీల్వాడి, మార్చి 29