మోర్తాడ్, జూన్ 24: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్వహణను ప్రైవేట్కంపెనీలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పోచంపాడ్లో విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలిపారు. బుధవారం భోజన విరామ సమయంలో ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి హైడ్రోపవర్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు.
ప్రభుత్వ విద్యుత్రంగ సంస్థల పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టీజీ పీఈజేఏసీ నాయకులు సతీశ్, రఫీక్, దేవరాజ్ తెలిపారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్వహణను ప్రైవేట్కంపెనీలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.