డిచ్పల్లి/ సిరికొండ, జనవరి 8 : డిచ్పల్లి, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ బూత్ స్థాయి కమిటీలను మండల నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నుకున్నారు. డిచ్పల్లి మండలంలోని కమలాపూర్, మిట్టపల్లి, రాంపూర్, కొత్తపేట్ గ్రామాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బూత్ కమిటీలను ఎన్నుకున్నారు. ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ సూచనల మేరకు బూత్ కమిటీలను ఎన్నుకుంటున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, ఇన్చార్జి పద్మారావు, నాయకులు నల్లవెల్లి సాయిలు, నడిపన్న, ఒడ్డం నర్సయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షుడు విఠల్రాథోడ్, ఉపాధ్యక్షుడు సుదాం రాథోడ్, బాబా, యూత్ అధ్యక్షుడు అమీర్, సెక్రటరీ గిరి, సర్పంచులు తిరుపతి గణేశ్, నర్సయ్య, ఎంపీటీసీలు గణేశ్, పోతర్ల రవి, బాలగంగాధర్, నాయకులు శ్రీకాంత్, గోపు వెంకన్న, రత్నం, గంగాధర్ పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలంలోని గొల్లపల్లిలో బీఆర్ఎస్ బూత్ కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం కమిటీకి నియామకపత్రాన్ని నాయకులు అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకుడు జీనియస్ నారాయణరెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు కృష్ణ, సర్పంచ్ ముల్లంగి మధు, మాజీ సర్పంచ్ అంజన్న, కో-ఆప్షన్ మెంబర్ నయీం, సంజయ్కుమార్, గొల్లపల్లి సర్పంచ్ లింగం యాదవ్, ఉపసర్పంచ్ ఇందూరు గంగవ్వ, గ్రామ శాఖ అధ్యక్షుడు పెద్దోళ్ల రవియాదవ్, గుండాల నారాయణ, బూత్ కమిటీ సభ్యులు ఎన్.రాజేందర్, రాగం నర్సయ్య, సంగి రాజేశ్వర్, ఆనంద్కుమార్, నడిపి రాజన్న, సాయిలు, సాయమ్మ, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్ గ్రామంలో బీఆర్ఎస్ బూత్ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. గ్రామంలో ప్రతి వంద మందికి ఒక సభ్యుడిని ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారవోయిన శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు గాదారి కృష్ణారెడ్డి, సర్పంచ్ గద్దల గంగాదాస్, ఎంపీటీసీ సభ్యుడు చిన్న గంగు, కార్యకర్తలు పాల్గొన్నారు.