ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆదివారం నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏఎంసీ గోడౌన్లో జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను లెక్కించారు.
కౌంటింగ్ సందర్భంగా కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 5 గంటల నుంచి మొదలైన ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విజేతలైన వారికి సంబంధిత రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.