డిచ్పల్లి, జూలై18: తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఎంసెట్-2022) తొలిరోజు ప్రశాంతంగా ముగిసిందని ఎంసెట్ ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య ఆరతి తెలిపారు. ఇంజినీరింగ్ విభాగం కోర్సుల ప్రవేశాలకు సోమవారం జరిగిన పరీక్షకు 425 మంది విద్యార్థులకు 421 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
కాకతీయ మహిళా ఇంజినీరింగ్, విజయ్ రూరల్ ఇంజినీరింగ్, ఆర్మూర్లోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉదయం జరిగిన పరీక్షలకు 200 మంది విద్యార్థులకు 197 మంది హాజరుకాగా, ముగ్గురు గైర్హాజరైనట్లు తెలిపారు. మ ధ్యాహ్నం జరిగిన పరీక్షకు మొత్తం 225 మందికి 224 మంది హాజరుకాగా, ఒకరు గైర్హాజరైనట్లు ఆమె పేర్కొన్నారు.