విద్యానగర్, డిసెంబర్ 2: పాత కక్షలతో ఇరువర్గాలవారు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో శుక్రవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే కాలానికి చెందిన కొందరు యువకులు గురువారం రాత్రి పార్టీ చేసుకుంటున్న సమయంలో మరి కొందరితో గొడవ జరిగింది.
పాత కక్షలతో తీవ్ర ఘర్షణకు దారితీసింది. ప్రత్యర్థి వర్గం సభ్యులు ఇందిరానగర్ కాలనీ యువకులను చితకబాదడంతో తీవ్ర గాయలయ్యాయి. క్షత్రగాత్రులు కామారెడ్డి పట్టణ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేయడంతో మరోసారి గొడవ చెలరేగింది. ఇరువర్గాల వారు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో అజహర్, సాహెర్, ఇజాజ్, సల్మాన్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.