నిజామాబాద్ రూరల్ / డిచ్పల్లి/ కోటగిరి / రుద్రూర్,/ బాల్కొండ/ మెండోరా/ శక్కర్నగర్/ వేల్పూర్/రెంజల్/ , డిసెంబర్ 7 : నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామశివారులో ఉన్న లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి పిట్ల కృష్ణ మహరాజ్ ఆధ్వర్యంలో దత్త జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు. వేడుకల్లో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నిజామాబాద్ ఎంపీపీ బానోత్ అనూషా ప్రేమ్దాస్, జడ్పీటీసీ బొల్లెంక సుమలతా గోపాల్రెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు మధుకర్రావు పాల్గొని పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేసీఆర్ సేవాదళ్ రూరల్ సెగ్మెంట్ కన్వీనర్ కోర్వ దేవేందర్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, ప్రజాప్రతినిధులు నగేశ్, అంకల గంగాధర్, దాసరి శ్రీధర్, స్వామి పాల్గొన్నారు.