ఆర్మూర్టౌన్, ఏప్రిల్ 23: అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని స్థానిక నాయకులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలని, ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రైతులు పూర్తిగా నష్టపోతున్నారని ఆరోపించారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కంటికి రెప్పలా చూసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాలుగునెలల్లోనే రైతులకు కష్టాలు వచ్చాయన్నారు. హస్తం పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. జీవన్రెడ్డి వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు.