పొలం దున్నేందుకు కేజ్వీల్స్తో వెళ్తున్న డ్రైవర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పొలం దున్నేందుకు వెళ్లిన డ్రైవర్ ఇంటికి వస్తాడన్న భరోసా లేకుండా పోతోంది. రెక్కాడితే గాని డొక్కాడని డ్రైవర్లు అనుకోకుండా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. కుటుంబాలకు కడుపుకోత మిగుల్చుతున్నారు. కేజ్వీల్స్ ట్రాక్టర్లు బోల్తా పడి ఏటా అనేక మంది మృతిచెందుతున్నారు. సాగులో యాంత్రీకరణ తప్పనిసరి కావడం, డ్రైవర్కు అవగాహన లేకపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో ఎక్కడో ఒకచోట మృత్యువాత పడుతున్న ఘటనలు వెలుగు చూస్తుడడంతో డ్రైవర్ల కుటుంబాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది.
-లింగంపేట, డిసెంబర్ 12
ముందు జాగ్రత్తలు పాటించండి