బిచ్కుంద, జనవరి 6:జుక్కల్ నియోజకవర్గంలో సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. మండలంలోని పెద్ద దేవాడ గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. అర్హులందరికీ విడుతల వారీగా డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట గ్రామ సర్పంచ్ శివనందప్ప, డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
డ్రోన్ స్ప్రేయర్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే షిండే అన్నారు. బిచ్కుంద మండలంలోని పెద్ద దేవాడ గ్రామంలో బిచ్కుంద మహిళా సమాఖ్య వారు ఆరు లక్షల రూపాయల వ్యయంతో డ్రోన్ స్ప్రేయర్ను ఏర్పాటు చేయగా.. ఎమ్మెల్యే హన్మంత్ షిండే దానిని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంట వ్యవధిలో సుమారు ఐదు ఎకరాల పంటకు డ్రోన్ స్ప్రేయర్ ద్వారా మందు పిచికారీ చేయవచ్చని తెలిపారు. కూలి డబ్బులు కూడా ఆదా అవుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్పటేల్, జడ్పీటీసీ సభ్యుడు భారతీరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, ఐకేపీ ఏపీఎం నాగరాజు, రైతులు పాల్గొన్నారు.