నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 19 :పేదల జీవితాల్లో ‘వెలుగు’లు నింపడానికి తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం దని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు, సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలను పంపిణీ చేశారు.
ధర్పల్లి మండలకేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహం, కళాశాల తండా, పంచాయతీ పరిధిలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ నల్ల సారికా హన్మంత్రెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం, కొత్తపేటలో శిబిరాలను జడ్పీసీఈవో గోవింద్, జడ్పీటీసీ సభ్యురాలు బొల్లెంక సుమలతా గోపాల్రెడ్డి, ఎంపీపీ బానోత్ అనూసాప్రేమ్దాస్, ఎంపీడీవో మల్లేశ్, తహసీల్దార్ అనిల్కుమార్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్రావు, డాక్టర్ అలేఖ్య ప్రారంభించారు. మోపాల్ మండలం న్యాల్కల్లో ఎంపీపీ లత కన్నీరాం, మోస్రా మండల కేంద్రంలో ఎంపీపీ పిట్ల ఉమాశ్రీరాములు, సర్పంచ్ సుమలతా రాంరెడ్డి, వర్ని మండలం తగిలేపల్లిలో జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్ శిబిరాలను ప్రారంభించారు.
డిచ్పల్లి మండలం ధర్మారం, బీబీపూర్, గొల్లపల్లి గ్రామాల్లో శిబిరాలను కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేశారు. గొల్లపల్లి నూతన గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో శిబిరాన్ని ఎంపీడీవో గోపీబాబు ప్రారంభించారు. సిరికొండ మండల న్యావనందిలో జడ్పీటీసీ సభ్యుడు మలావత్ మాన్సింగ్, డీసీవో సింహాచలం, సర్పంచ్ కన్క శ్రీనివాస్, జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఎంపీపీ కుంచాల విమలరాజు కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. 220 మంది పరీక్షలు చేయించుకోగా, 74 మందిని రిఫర్ చేసినట్లు తెలిపారు. రుద్రూర్లోని గ్రామ పంచాయతీ ఎంపీపీ అక్కపల్లి సుజాత, జడ్పీటీసీ సభ్యుడు నారోజి గంగారాం, కోటగిరి మండలకేంద్రంలో జడ్పీటీసీ సభ్యుడు శంకర్పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్ శిబిరాలను ప్రారంభించారు.
‘కంటివెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలి
ఇందల్వాయి మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల ప్రజలు కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రమేశ్ నాయక్ కోరారు. మండల కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మండలంలో ఈనెల 24న కంటివెలుగు శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మాక్లూర్ మండలంలోని బొంకన్పల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ప్రారంభించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 1, 4, 33వ వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలను మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతాపవన్ ప్రారంభించారు. మచ్చర్లలో కంటి వెలుగు శిబిరాన్ని ఆర్డీవో శ్రీనివాసులు ప్రారంభించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. దేగాంలో మెడికల్ అధికారి పూజ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. డొంకేశ్వర్ మండలంలోని నూత్పల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ కూనింటి రవి ప్రారంభించారు.
బాల్కొండ, వన్నెల్(బి) గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలను పంపిణీ చేశారు. మెండోరా మండలంలోని పోచంపాడ్లో కంటి వెలుగు శిబిరాన్ని డీసీసీబీ డైరెక్టర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్రెడ్డి ప్రారంభించారు. భీమ్గల్ మండల కేంద్రంలో మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమలతాసురేందర్, బాబాపూర్లో జడ్పీటీసీ చౌట్పల్లి రవి, బెజ్జోరాలో మండల ప్రత్యేకాధికారి, డీఈవో దుర్గాప్రసాద్ కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. మోర్తాడ్లోని తకూరివాడలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ శివలింగుశ్రీనివాస్, జడ్పీటీసీ బద్దంరవి ప్రారంభించారు. వేల్పూర్ మండలంలోని పోచంపల్లి, అక్లూర్ గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలను జడ్పీటీసీ అల్లకొండ భారతి, ఎంపీపీ భీమా జమున ప్రారంభించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలను పంపిణీ చేశారు. కమ్మర్పల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ లోలపు గౌతమి సుమన్ ప్రారంభించారు. ఏర్గట్ల మండల కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్ ప్రారంభించి అవసనమైన వారికి మందులు, కళ్లద్దాలను పంపిణీ చేశారు.
బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాలను ఎమ్మెల్యే షకీల్ ప్రారంభించారు. గంజ్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఎమ్మెల్యే కంటి పరీక్షలు చేయించుకున్నారు. సాలూర మండల కేంద్రంలో, బోధన్ మండలంలోని సాలంపాడ్లో కంటి వెలుగు శిబిరాలను ఎంపీపీ బుద్దెసావిత్రీరాజేశ్వర్ ప్రారంభించారు. నవీపేట మండలంలోని కమలాపూర్, అభంగపట్నం, నవీపేట్ గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలను ఎంపీపీ సంగెం శ్రీనివాస్ ప్రారంభించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలను పంపిణీ చేశారు. రెంజల్ మండల కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ లోలపు రజిని ప్రారంభించారు. ఎడపల్లి మండల కేంద్రంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలను పంపిణీ చేశారు.