మాక్లూర్: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో తుకారం రాథోడ్ అన్నారు. మాక్లూర్ మండల పరిధిలోని గుత్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న వేళ పరిసరాలు, వాటర్ ట్యాంకులు, కిచెన్ షెడ్లలో శానిటేషన్ చేయలని సూచించారు. విద్యార్థుల కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అనంతరం గుత్ప గ్రామంలో పర్యటించారు. ఇండ్ల ప్రాంగణాల్లో నీటి నిల్వలు ఉండొద్దని ప్రజలకు సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని, జ్వరం ఉంటే చికిత్స చేయించుకోవాలని చెప్పారు. ఈ కార్యాక్రమంలో కల్లడి పీహెచ్సీ వైద్యులు సిఖిందర్నాయక్, ఏఎన్ఎంలు, ఆశ, సిబ్బంది పాల్గొన్నారు.