కోటగిరి/జక్రాన్పల్లి/చందూర్/ ఆర్మూర్, డిసెంబర్ 9 : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది. వైద్యారోగ్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఫస్ట్, సెకండ్ డోస్ టీకా వేస్తున్నారు. వ్యవసాయపనులకు వెళ్లి సాయంత్రం ఇండ్లకు చేరిన వారికికూడా రాత్రి వరకు టీకాలు వేస్తున్నారు. కోటగిరి మండలం దోమలెడ్గి శివారులోని పంటపొలాల్లో పని చేస్తున్న వారికి ఏఎన్ఎం సవిత, ఆశ కార్యకర్త కరుణశ్రీ టీకాలు వేశారు. జక్రాన్పల్లి మండలంలో వ్యాక్సినేషన్ ము మ్మరంగా కొనసాగుతున్నదని ఎంపీడీవో లక్ష్మణ్ తెలిపారు. చందూర్ మండల కేంద్రం లో వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారు. ఆర్మూర్ పట్టణంలోని దయానంద్నగర్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్ ఆదేశాల మేర కు ఆరోగ్య, ఆశ కార్యకర్తలు రాత్రి వరకు ఇంటింటికీ తిరుగుతూ కొవిడ్ టీకా వేశారు.
స్పెషల్ డ్రైవ్ను పరిశీలించిన డీఎంహెచ్వో
కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూరు, రెంజ ల్ మండలం సాటాపూర్, కందకుర్తి, వీరన్నగుట్ట, నీలా, పేపర్మిల్ గ్రామాల్లో డీఎంహెచ్వో పర్యటించి స్పెషల్ డ్రైవ్ను పర్యవేక్షించారు.