డిచ్పల్లి, నవంబర్ 30 : తైవాన్ దేశంలోని తిచుంగ్ నగరంలో డిసెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు జరిగే ప్రపంచకప్ అండర్-12 సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు రాష్ట్ర, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శులు కె.శోభన్బాబు, మర్కంటి గంగామోహన్ తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో నవంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు జరిగిన అండర్-12 భారత సాఫ్ట్బాల్ జట్టు ఎంపికలో జిల్లా క్రీడాకారులు క్యాదారి సంహిత (సాంఘిక సంక్షేమ పాఠశాల-ధర్మారం), లిఖిత (సాంఘిక సంక్షేమ పాఠశాల -సుద్దపల్లి) పాల్గొని ప్రతిభ చూపి ప్రపంచ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.
ఎంపికైన క్రీడాకారులను అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం అభినందించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల స్పోర్ట్స్ ఆఫీసర్ రామలక్ష్మయ్య, నోడల్ ఆఫీసర్ శేషుకుమారి, జిల్లా స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ నీరజారెడ్డి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధానకార్యదర్శి బొజ్జ మల్లేశ్గౌడ్, జిల్లా బేస్బాల్ సంఘం అధ్యక్షుడు ఎల్.మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.