ఖలీల్వాడి, మే 25: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్లో ఉన్న షాహిన్ దవాఖానకు జిల్లా వైద్యాధికారి తుకారాం రాథోడ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శనివారం రాత్రి నుంచే వైద్య సేవలు నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కొన్ని రోజుల క్రితం వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ గర్భసంచి తీసివేయాల్సి రావడంపై కలెక్టర్, జిల్లా వైద్యారోగ్యశాఖకు ఫిర్యాదు అందింది. దీంతో డీఎంహెచ్వో తుకారాం రాథోడ్ విచారణ చేపట్టి షోకాజ్ నోటీసులను పంపించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని, కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.