ధర్పల్లి, నవంబర్ 26 : మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్.. ఎంపీపీ నల్ల సారికా హన్మంత్రెడ్డితో కలిసి శనివారం అందజేశారు. మండల పరిషత్ కార్యాలయంలో 8 మంది లబ్ధిదారులకు షాదీముబారక్, నలుగురికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ జాతీయస్థాయిలో తెలంగాణను నంబర్వన్ స్థానంలో నిలుపుతున్నారని అన్నారు. కేసీఆర్ జాతీయస్థాయిలో రాణించేలా అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్ పీసు రాజ్పాల్రెడ్డి, తహసీల్దార్ గంగాసాగర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ఎంపీటీసీ సభ్యుడు పెండ గంగాధర్, నాయకులు గంగారెడ్డి, పోతరాజు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు
ధర్పల్లి మండలంలోని గోవింద్పల్లి గ్రామపరిధిలో ఉన్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ జాతరోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, ఎంపీపీ నల్ల సారికా హన్మంత్రెడ్డి కల్యాణోత్సవం, అన్నదానంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ధర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్, గోవింద్పల్లి సర్పంచ్ మోహన్, ఎంపీటీసీలు శేఖర్, గంగాధర్, సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి దరావత్ గోపాల్నాయక్, నాయకులు సురేందర్గౌడ్, సుభాష్, గంగదాస్, అర్గుల్ రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.