భీమ్గల్/మాక్లూర్, నవంబర్ 22: భీమ్గల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఎనిమిది మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, కౌన్సిలర్తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కన్నె సురేందర్, కౌన్సిలర్లు బొదిరె నర్సయ్య, సతీశ్గౌడ్, ధారావత్ లింగయ్య, కోఆప్షన్ సభ్యుడు నవీన్, నాయకులు డాక్టర్ ముత్తెన్న, మూత లింబాద్రి, నరేశ్ పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లిలో పలువురికి సర్పంచ్ చింత మల్లారెడ్డి ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు గంగాధర్, బండారి రాములు, ఒడ్డెన్న యాదవ్ పాల్గొన్నారు.