రుద్రూర్, డిసెంబర్ 21 : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆర్థిక భరోసా ఇస్తున్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రుద్రూర్, కోటగిరి, పొతంగల్, వర్ని, చందూర్, మోస్రా మండలాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాయాన్ని సహించేది లేదని, ఈ అలవాటు తనకు పుట్టుకతో వచ్చిందన్నారు. ప్రతి గ్రామంలో అర్హులను ఎంపిక చేసే బాధ్యత ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలదే అన్నారు.
నిజాయితీగా పని చేసే నాయకులకు తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన హామీలను ఎలా అమలు పరుస్తారో వేచి చూద్దామన్నారు. 206 మందికి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, ఎంపీపీ అక్కపల్లి సుజాతానాగేందర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, తహసీల్దార్ వెంకటేశ్వర్, కోఆప్షన్ సభ్యుడు మస్తాన్, విండో మాజీ చైర్మన్ రాము, విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, ఎంపీటీసీ సావిత్రి, వర్ని మండల అధ్యక్షుడు గిరి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.