విద్యానగర్, డిసెంబర్ 16 : జిల్లాలోని 9,038 స్వ యం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఐకేపీ అధికారులతో శుక్రవారం బ్యాంకు లింకేజీ రుణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 15,519 స్వయం సహాయక సంఘాలకు రూ. 854.80 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు అందించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు.
ఈ రుణాలతో మహిళలు సోలార్ యూనిట్లు, డెయిరీ, చేపలు, గేదెల పెం పకం, పాలు పితికే యంత్రాలు తీసుకునే విధంగా సమన్వయకర్తలు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. 1634 స్వయం సహాయక సంఘాలకు సంబంధించి రూ. 12.69 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గాంధారి, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో బ్యాంక్ లింకేజీ రుణాల బకాయిలు ఉన్నాయని, వాటి కోసం స్పెషల్ కమిటీల ద్వారా వ సూలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్డీవో సాయన్న, అదనపు డీఆర్డీవో బి. మురళీకృష్ణ, డీపీఎంలు రవీందర్ రావు, సుధాకర్, రమేశ్ బాబు, జ్ఞాన్, వకుళ, ఏపీఎంలు పాల్గొన్నారు.