నిజామాబాద్ రూరల్, జనవరి 1 : కమ్మ సంఘం జిల్లా అధ్యక్షురాలిగా అప్పనేని లక్ష్మీశ్రీనివాస్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవనగర్లోని జిల్లా కమ్మ సంఘం కార్యాలయ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సమావేశానికి హాజరైన డైరెక్టర్లు.. ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమ్మ సంఘంలోని పలువురు బాధ్యులు ఇంతకుముందు సంఘానికి సంబంధించిన నిధుల లెక్కలు చూపించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, జిల్లా అధ్యక్ష పదవికి నవంబర్ 26న రావుల సుబ్బారావు రాజీనామా చేశారు.
ఈ మేరకు సంఘం డైరెక్టర్లు ప్రత్యేక సమావేశమై జిల్లా అధ్యక్షురాలిగా లక్ష్మిని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధానకార్యదర్శిగా ఉన్న కావూరి కృష్ణారావు సంఘం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా అతడిని తొలగించి ఆయన స్థానంలో పరుచూరి పవన్కుమార్ను డైరెక్టర్లు ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శులుగా వెనిగళ్ల సురేశ్ ఉన్నప్పటికీ.. మరొకరి అవసరం మేరకు నాగళ్ల శ్రీనివాస్రావును నూతనంగా ఎన్నుకున్నారు.
వేములపల్లి గోపీచంద్ను కో-ఆప్షన్ మెంబర్గా ఎన్నుకున్నారు. మాధవ్నగర్లోని కమ్మ సంఘం భవన ప్రాంగణంలో ఉన్న కల్యాణ మండపంలో మహిళలకు వాష్రూమ్లు నిర్మించాలని, కల్యాణ మండపం, డైనింగ్ హాళ్లపై రేకులు వేయించాలని, అభివృద్ధి పనులు చేపట్టాలని డైరెక్టర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సమావేశంలో సంఘం కోశాధికారి ముప్పనేని అప్పారావు, ఉపాధ్యక్షులు ఏవీఎస్ నారాయణ, సలహాదారులు పోలవరపు వెంకట సుబ్బారావు, వెళగపూడి కేశవరావు, నాయుడి ఆంజనేయులు, డైరెక్టర్లు వనకంచి సుబ్బారావు, గంట సాంబశివరావు, మురకొండ మధు, పాటుబండ్ల శ్రీనివాస బాలాజీ తదితరులు పాల్గొన్నారు.