డిచ్పల్లి, ఆగస్టు 2: మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ సెంటర్ను మంజూరు చేసినట్లు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొ త్తం 61 డయాలసిస్ సెంటర్లు, 515 యంత్రాలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి సీహెచ్సీకి తొలిసారిగా డయాలసిస్ సెంటర్, రోగులకు చికిత్స అందించడానికి 5 యంత్రాలు మంజూరైనట్లు తెలిపారు. కిడ్నీ సంబంధిత రో గులు గతంలో డయాలసిస్ కోసం జిల్లా ప్రభుత్వ దవాఖాన, ప్రైవేటు హాస్పిటల్స్ చుట్టూ తిరిగేవారని ఇకపై స్థానికంగా ఉన్న డిచ్పల్లి సీహెచ్సీలోనే ఉచిత సేవలను పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. డయాలసిస్ సెంటర్ను మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.