ఖలీల్వాడి, ఫిబ్రవరి 26: పాత పద్ధతిలోనే అంగన్వాడీ హెల్పర్ల నియామకాలు చేపట్టి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎ.రమేశ్బాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్, దేవగంగు మాట్లాడారు. అంగన్వాడీ ప్రమోషన్ సౌకర్యాన్ని కల్పించేందుకు విద్యార్హతను ఇంటర్కు మార్చారని, దీంతో అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న హెల్పర్లకు నష్టం జరిగే అవకాశమున్నదన్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పాత పద్ధతుల్లో నియామకాలు చేపట్టాలని కోరారు. మూడు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను, సమ్మెకాలంలో 24రోజుల వేతనాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.స్వర్ణ, కోశాధికారి చంద్రకళ, ఉపాధ్యక్షురాలు మంగాదేవి తదితరులు పాల్గొన్నారు.