దీర్ఘకాలిక రుణ బకాయిదారులకు అవకాశం
ఆగస్టు 31 వరకు అవకాశం
డీసీసీబీ వార్షిక మహాజన సభలో చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి
నవంబర్లో శతాబ్ది ఉత్సవాలు
ఇందూరు, జూన్ 27: వచ్చే నవంబర్లో డీసీబీసీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తెలిపారు. సహకార సం ఘాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమ వారం ఏర్పాటు చేసిన మహాజన సభలో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పాలకవర్గ సభ్యులు, సొసైటీ అధ్యక్షులు, జిల్లా రైతాంగం, బ్యాంకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాలకవర్గ సభ్యులతో చర్చించి నవంబర్లో శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బ్యాంకు, సొసైటీల ద్వారా పొందిన దీర్ఘకాలిక రుణబకాయిదారులకు శుభవార్త తెలిపారు. పాలకవర్గ సభ్యులతో కలిసి ఏకకాల రుణ పరిష్కారాన్ని ఓటీఎస్(వన్టైమ్ సెటిల్మెంట్) ప్రకటించారు. ఈ స్కీమ్ జూన్ 27 నుంచి ఆగస్టు 31 వర కు అమలులో ఉంటుంది. కార్యక్రమంలో డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, డీసీసీబీ డైరెక్టర్లు, ఐడీసీఎంఎస్ డైరెక్టర్లు, డీసీవో సింహాచలం, కామారెడ్డి డీసీ వో వసంత, బ్యాంకు సీఈవో గజానంద్, ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.
‘ఓటీఎస్’కు సంబంధించి వివరాలు
విండోల ద్వారా పొందిన రుణాలకు..
బ్యాంకు ద్వారా పొందిన రుణాలకు..