కోటగిరి, ఫిబ్రవరి 19: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతోపాటు దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. జిల్లాలోనే మొదటి సారిగా ఉమ్మడి కోటగిరి మండలంలోని పొతంగల్ విశాల సహకార పరపతి సంఘం పరిధిలోని హెగ్డోలి గ్రామంలో మార్క్ఫెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా భాస్కర్రెడ్డి మాట్లాడుతూ .. కేంద్ర సహకారం లేకపోయినా కేసీఆర్ ప్రభుత్వం రైతుల శ్రే యస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని అన్నా రు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట దళారులకు విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో శనగ క్వింటాలుకు రూ.5,335 ధర చెల్లిస్తుందని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పొతంగల్ విండో చైర్మన్ శాంతేశ్వర్పటేల్, జడ్పీటీసీ శంకర్పటేల్, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, జడ్పీ కో-ఆప్షన్ సిరాజ్, రైతుబంధుసమితి మండల కన్వీనర్ కొల్లూర్ కిశోర్బాబు, వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్పటేల్, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్, వైస్ చైర్మన్ కల్లూర్ రాంరెడ్డి, మాజీ ఏఎసీ చైర్మన్ నీరడి గంగాధర్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, కొత్తపల్లి విండో చైర్మన్ డాక్టర్ సునీల్కుమార్, స్థానిక ఎంపీటీసీ ఉమారాం బాబు, ఉప సర్పంచ్ శ్రీనివాస్, అర్జున్పటేల్, వాసుబాబు, కొల్లూర్ హరిపటేల్, సంపత్, మాధవ్రావు, పత్తి లక్ష్మణ్, వర్ని శంకర్, కూచి సిద్దూ, కేశ వీరేశం, సోంపూర్ ఎంపీటీసీ అనంత విఠల్, చాకూరే గంగాధర్, లోని జగన్, హౌగిరావుపటేల్, శ్రీగంగ, నంబర్ సాయిలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.