విద్యానగర్/ నిజామాబాద్ క్రైం, ఆగస్టు 28: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 68 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో 48 సెంటర్లలో 15,528 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 14,450 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను సీపీ నాగరాజు పరిశీలించారు.
సిబ్బందికి అవసరమైన సూచనలు అందజేశారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన 20 కేంద్రాల్లో 6,639 మంది అభ్యర్థులకు 5,901 మంది హాజరయ్యా రు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 29 పరీక్షా కేం ద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 11,042 మంది అభ్యర్థులకు 10,372 మంది హాజరు కాగా 670 మంది గైర్హాజయ్యారు. 93.93 హాజరు శాతం నమోదైంది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తనిఖీ చేశారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆల్ ది బెస్ట్ ఫ్లెక్సీల ఏర్పాటు
నిజామాబాద్ నగరంలోని పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ‘ఆల్ ది బెస్ట్’ అని పేర్కొంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు తమ సెంటర్లకు సులువుగా చేరుకునేందుకు వన్టౌన్ ఎస్హెచ్వో డి. విజయ్ బాబు ఆధ్వర్యంలో సిబ్బంది కలిసి బస్టాండ్ లో రూట్ మ్యాప్తో పాటు హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు.