బాన్సువాడ, మే 2 : బీఆర్ఎస్లోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని 14వ వార్డు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏఎంసీ మాజీ చైర్మన్ నార్ల రవీందర్ గుప్తా , సిర్న అశోక్ గుప్తా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో గురువారం బీఆర్ఎస్లో చేరారు. వారికి పోచారం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నార్ల రవీందర్ గుప్తా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో లబ్ధి చేకూర్చాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాన్సువాడ పట్టణాన్ని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు.
పదేండ్లలో సుమారు రూ.10 వేల కోట్లతో అభివృద్ధి చేశారని కొనియాడారు. వివిధ పనులు చేపట్టారని తెలిపారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది బీఆర్ఎస్లోకి రానున్నారని అన్నారు. సొంత గూటికి చేరిన బుడగజంగం కాలనీ వాసులు మూడో వార్డులోని బుడగజంగం కాలనీ వాసులు ఎమ్మెల్యే పోచారం సమక్షంలో తిరిగి బీఆర్ఎస్లోకి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బుధవారం కొంతమంది తమను తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ కండువాలు వేశారని, కానీ తాము పోచారం వెంటే ఉంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జి డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, మహ్మద్ ఎజాస్, హకీం, పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ , కార్యదర్శి నార్ల ఉదయ్ గుప్తా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్నాయక్ పాల్గొన్నారు.