వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ తదితర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం హైదరాబాద్లో రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో నియోజకవర్గంలోని వేల్పూర్, భీమ్గల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామానికి శోభన్రెడ్డి(కాంగ్రెస్), భూమేశ్వర్రెడ్డి(బీఎస్పీ), నరేశ్(బీజేపీ), భీమ్గల్ మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన మారంపల్లి రాజేశ్వర్(బీఎస్పీ), కాంగ్రెస్ పార్టీకి చెందిన బండారు బక్కన్న, గుంటూరు గంగాదాస్, సాయిలు, తొగిటి నవీన్, ఆరెపల్లి బాలరాజ్, బంగ్లా రాజు, చిలువేరి రాజేశ్, లక్కాకుల సందీప్ తదితర వంద మందికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్శితులై టీఆర్ఎస్ పార్టీలో చేరటానికి ముందుకు వస్తున్నారన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల అభివృద్దికి ఒక లక్షంతో ముందుకు సాగుతున్నారన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతు పేద ప్రజల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో భీమ్గల్ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జడ్పీటీసీ రవి, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, భీమ్గల్ టీఆర్ఎస్ మండల కన్వీనర్ దొనకంటి నర్సయ్య, గున్వీర్రెడ్డి, వేల్పూర్ టీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర్, రామన్నపేట్ సొసైటీ చైర్మన్ మోహన్రెడ్డి, శోభన్, నరేందర్, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.