ఖలీల్వాడి, డిసెంబర్ 6 : నిజామాబాద్ జిల్లా కేం ద్రంలోని ఎస్ఎఫ్ఎస్లో రెండు రోజులుగా నిర్వహిచంచిన జిల్లాస్థాయి సైన్స్ఫేర్ మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు హాజరై ఉత్తమ ప్రయోగాలకు బహుమతులను అందజేశారు.
రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రదర్శనలు, గైడ్ టీచర్లను అభినందించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, డీఈవో దుర్గాప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, డీసీబీ సెక్రటరీ సీతయ్య, ట్రస్మా అధ్యక్షుడు జయసింహాగౌడ్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.