కంఠేశ్వర్, జూలై 15: ‘సర్’ గడువు ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారా(ఈఎఫ్)లను భర్తీ చేసి త్వరగా బీఎల్వోలకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. పూర్తి వివరాలు డిజిటలైజేషన్ చేయాల్సి ఉంటుందని, వలసపోయిన, మరణించిన వారి పేర్లు తొలగించి, ఓటర్ల జాబితాను రూ పొందించాల్సి ఉన్నదని, ఆఖరు వరకు వేచి చూడకుండా వెంటనే ఈఎఫ్లను వెంటదివెంటనే అందజేయాలని పేర్కొన్నారు.
ఈఎఫ్లు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఓటరు జాబి తా నుంచి పేరు గల్లంతవుతుందని స్పష్టం చేశారు. ఎవరికైనా 2002 ఎస్ఐఆర్ వివరా లు తెలియకపోతే సర్కిల్ వారీగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను లేదా బీఎల్వోలను సం ప్రదించాలని సూచించారు. అయినప్పటికీ వివరాలు తెలియని పక్షంలో ప్రస్తుత ఓటరు జాబితా వివరాలు పొందుపర్చి ఫారం సమర్పించవచ్చని పేర్కొన్నారు. అలాంటి వారి పేరు కూడా ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చబడుతుందని తెలిపారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతమయ్యేలా పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. జాబితాను పక్కాగా రూపొందించి, వాటిపై బీఎల్ఏల సంతకాలు తీసుకోవాలని సూచించారు.