డిచ్పల్లి, మార్చి 18: డిచ్పల్లిలోని సీఎంసీ(క్రిస్టియన్ మెడికల్ కాలేజీ)ని ఓట్ల లెక్కింపు కోసం సిద్ధం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పోల్ అయ్యే ఓట్లన్నీ సీఎంసీలోనే లెక్కించనున్న నేపథ్యంలో పక్కాకా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీఎంసీ భవనంలోని గదులను సోమవారం పరిశీలించిన ఆయన అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. భద్రతాపరమైన అంశాలను నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన మార్పులు, చేర్పులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తగిన బందోబస్తు కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపుతోపాటు అర్బన్, రూరల్ సెగ్మెంట్ల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను కూడా సీఎంసీలోనే చేపట్టనున్నామన్నారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, ట్రెయినీ కలెక్టర్ కిరణ్మయి తదితరులు ఉన్నారు.