ఖలీల్వాడి, ఆగస్టు 21: సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. దీంతోపాటు నగరంలోని టీఆర్ఎస్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 29న పెద్దపల్లి, సెప్టెంబర్ 5న నిజామాబాద్, 10న జగిత్యాల జిల్లా కలెక్టరేట్లను ప్రారంభించనున్నట్లు షెడ్యూల్ను విడుదల చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమైంది.