నిజామాబాద్ రూరల్, జూలై 8 : గిరిజనులు ఎన్నో దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ తండా జగదాంబ సేవాలాల్ మహరాజ్ ఆలయ ప్రాంగణంలో ఆరు గ్రామాలకు చెందిన 115 ఎకరాల భూములకు సంబంధించి 138 మంది రైతులకు పోడు భూముల పట్టాలను శనివారం పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్తో కలిసి బాజిరెడ్డి పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మూడువేల మంది గిరిజనులకు 1700 ఎకరాలకు సంబంధించి పోడు భూముల పట్టాలను పంపిణీ చేశామని తెలిపారు. సమైక్యపాలనలో తెలంగాణ ప్రాంతం ఎంతగానో వివక్షకు గురైందన్నారు. నిధుల మంజూరు లేక అభివృద్ధిలో వెనుకబడిందని గుర్తుచేశారు. ఇప్పుడు అందుకుభిన్నంగా కేసీఆర్ ప్రభు త్వం విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు అధిక ప్రా ధాన్యం ఇచ్చి, పుష్కలంగా నిధులు మంజూరుచేస్తోందన్నారు.
అభివృద్ధి కళ్లెదుట కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని తెలిపారు. గ్రామాల్లో కళాహీనంగా మా రిన చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరణ పనులు చేపట్టి వాటికి పూర్వ వైభవం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం పెరగడంతోపాటు ఆయకట్టు కింద పం టల సాగు విస్తీర్ణం కూడా అదే స్థాయిలో పెరి గిందని, దీంతో రైతులు సంతృప్తి చెందుతున్నారని తెలిపారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న వారిలో కొందరికి పట్టాలు రాలేదని పలువురు తన దృష్టికి తెచ్చారని, కలెక్టర్తో మాట్లాడి మరోసారి విచారణ చేపట్టి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే భరోసానిచ్చారు.
జగదాంబ సేవాలాల్ మహరాజ్ ఆలయ ఆవరణలో వంటశాల నిర్మాణానికి రూ.10లక్షలు నిధులు మంజూరు చేస్తానని బాజిరెడ్డి హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ అనూషా ప్రేమ్దాస్, జడ్పీటీసీ బొల్లెంక సుమలతా గోపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుకర్రావు, సర్పంచ్ హరిచంద్నాయక్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, ఆలయ కమిటీ చైర్మన్, ఆర్డబ్ల్యూ ఎస్ ఈఈ మున్నీనాయక్, ఎంపీడీవో మల్లేశ్, తహసీల్దార్ అనిల్కుమార్, నుడా డైరెక్టర్ ముస్కె సంతోష్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అశోక్, బీఆర్ఎస్ మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు జమీర్ఖాన్, బీఆర్ఎస్ నాయకులు కొర్వ దేవేందర్, ప్రకాశ్, గోపాల్, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు.