ఖలీల్వాడి/ఎల్లారెడ్డి రూరల్/ ఆర్మూర్, సెప్టెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ఆర్పీల వేతనాలను పెంచడంపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు ఆర్మూర్, ఎల్లారెడ్డి తదితర మండలాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యేల చిత్రపటాలకు గురువారం క్షీరాభిషేకం చేశారు. వేతనలు పెంచినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.