కమ్మర్పల్లి/ ఆర్మూర్టౌన్/భీమ్గల్, మార్చి 19: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల ఏర్పాటు చేసిన చెక్పోస్టులను కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ మంగళవారం పరిశీలించారు. మొదట ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన తహసీల్ కార్యాలయం ఎదుట ఉన్న ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేం ద్రాన్ని పరిశీలించారు. తక్కువ పోలింగ్కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెర్కిట్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టును పరిశీలించారు. జిల్లా సరిహద్దులోని కమ్మర్పల్లిలో ఏర్పా టు చేసిన చెక్పోస్టు, భీమ్గల్లో స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. వారి వెంట అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్డీవో రాజాగౌడ్, ఏసీపీ బస్వారెడ్డి ఉన్నారు.