నిజామాబాద్ క్రైం, జూలై 3 : నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తి వద్దకు వచ్చిన వారి నుంచి నగదు దోచుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకున్నది. సంబంధిత వన్టౌన్ ఎస్హెచ్వో డి.విజయ్బాబు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ పట్టణానికి చెందిన దాసరి కృష్ణ, ఆయన భార్య వినోద సోమవారం మధ్యాహ్నం నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న బంధువు వద్దకు వచ్చారు. దవాఖాన బిల్లు చెల్లించేందుకు తమ వెంట డబ్బులను తీసుకొని వచ్చారు.
వారు దవాఖానలోని లిఫ్ట్లో వెళ్తున్న సమయంలో మరో ఇద్దరు బురఖాలు ధరించిన మహిళలు సైతం ఎక్కారు. లిఫ్ట్ దిగిన తర్వాత వినోద తన బ్యాగులోని రూ.96,500 అపహరణకు గురైనట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే ఆ భార్యభర్తలతో పాటు లిఫ్ట్లో ఎక్కి బురఖాలు ధరించిన ఇద్దరు ముస్లిం మహిళలు నగదు దొంగిలించినట్లుగా నిర్ధారించారు. దవాఖాన వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో వారి చిత్రాలను పోలీసులు గుర్తించారు. బాధితురాలు వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అయితే దవాఖానలకు వచ్చే వారు జాగ్రత్తలు పాటించాలని ఎస్హెచ్వో విజయ్బాబు సూచించారు.