నిజామాబాద్ క్రైం, జనవరి 11: తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన సురేశ్ కు టుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశార. ఇందులో భాగంగా విచారణ కోసం విజయవాడ పోలీసుల బృందం నిజామాబాద్కు చేరుకుంది. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక నగరంలోని గంగస్థాన్ ఫేజ్-2కు చెందిన వ్యాపారి సురేశ్ కుటుంబం ఐదు రోజుల క్రితం విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి నలుగురు వడ్డీ వ్యాపారులు కారణమంటూ ఆత్మహత్యకు ముందు పప్పుల సురేశ్ చేసిన సెల్ఫీ వీడియోతోపాటు వాయిస్ రికార్డు, సూసైడ్ నోట్ ఆధారంగా విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు గణేశ్, జ్ఞానేశ్వర్, నిర్మల్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. నిజామాబాద్కు చెందిన నిందితులను పట్టుకునేందుకు విజయవాడ టౌన్ సీఐ ఆధ్వర్యంలో బృందాలు రాగా, ఒక బృందం నిర్మల్కు వెళ్లింది. ఎస్సై ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందం ముందుగా సురేశ్ కుటుంబం నివాసం ఉన్న గంగస్థాన్లోని అపార్ట్మెంట్కు వెళ్లి స్థానికుల నుంచి వివరాలు సేకరించింది. సురేశ్ ఆత్మహత్యకు ముందు చేసిన వ్యాపారం, దానికి అవసరమైన డబ్బులను ఎవరి దగ్గర తీసుకున్నారు.. పెట్రోల్ బంక్ లీజ్కు తీసుకున్న సమయంలో వారికి ఏదైనా నష్టం జరిగిందా.. తదితర సమాచారాన్ని తెలుసుకున్నారు. సురేశ్ కుటుంబం ఆత్మహత్యకు ముందు వారి ఉండే అపార్ట్మెంట్కు ఎవరెవరు వచ్చా రు.. అక్కడ జరిగిన పరిణామాలను తెలుసుకునేందుకు సీసీ టీవీ ఫుటేజీలను సేకరించారు. అనంతరం సురేశ్ సెల్ఫీ వీడియోలో ఆరోపించిన మేరకు బీజేపీ నాయకుడు గణేశ్, జ్ఞానేశ్వర్ను అరెస్టు చేసి విజయవాడకు తీసుకెళ్లేందకు నగరంలో గాలింపు చర్యలు చేపట్టారు.
అజ్ఞాతంలోకి వడ్డీ వ్యాపారులు..
ఓ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన నగరానికి చెందిన ఇద్దరు వడ్డీ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వారి స్నేహితుల ద్వారా తెలిసింది. ఆత్మహత్యకు ముందు సురేశ్ వీడియోలో తెలిపిన మేరకు ఇద్దరు వడ్డీ వ్యాపారులు వారి సెల్ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకొని పరారీలో ఉన్నట్లు సమాచారం. నిందితులను ఎలాగైనా అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు విజయవాడ ప్రత్యేక బృందం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఉండనున్నట్లు సమాచారం.