ఆర్మూర్టౌన్, మార్చి23: ఆర్మూర్ పట్టణంలో మిట్టమధ్యాహ్నం వివాహిత దారుణ హత్య కలకలం రేపింది. సంతోష్నగర్ కాలనీలో శనివారం మధ్యాహ్నం ఆర్.లాస్య(22)ను గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన లాస్యకు రెండు సంవత్సరాల క్రితం ఆర్మూర్కు చెందిన రాకేశ్తో వివాహం జరిగింది. వీరికి శ్రీలక్షణ అనే ఏడు నెలల పాప ఉన్నది. భర్త మూడు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయికి వెళ్లాడు. శనివారం ఉదయం అత్త చిన్నుబాయి జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉన్న కూతురి వద్దకు వెళ్లింది.
లాస్య మధ్యాహ్నం ఒంటి గంటకు బీడీలు చుట్టేందుకు పక్కింటికి వెళ్లి వచ్చింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పాప ఏకధాటిగా ఏడుస్తుండడంతో పక్కింట్లో ఉంటున్న చిట్టి అనే మహిళ వెళ్లి చూడగా లాస్య రక్తపు మడుగులో పడి ఉన్నది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. లాస్య ఒంటిపై ఉన్న పుస్తెలతాడు, చెవి కమ్మలను దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు, క్లూస్ టీం, డాగ్స్కాడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్హెచ్వో రవి కుమార్ తెలిపారు.