ఆర్మూర్ టౌన్, మే 2: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలనూ మోసం చేసిందని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆ పార్టీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని మున్నూరుకాపు సంఘంలో గురువారం నిర్వహించిన మున్నూరుకాపు కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ..
అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులకు పాలన ఎలా చేయాలో తెలియదని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేసిందని గుర్తుచేశారు. కారు గుర్తుకు ఓటు వేసి, తనను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.