సదాశివనగర్/ గాంధారి, మార్చి 11: ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
సదాశివనగర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోల్లిపెల్లి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ నర్సింహులు, జడ్పీ కో- ఆప్షన్ సభ్యుడు మొహీనుద్దీన్, విండో చైర్మన్లు కమలాకర్ రావు, గంగాధర్, ఏఎంసీ వైస్ చైర్మన్ వడ్ల రాజేందర్, సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ వంకాయల రవి, మండల కో-ఆప్షన్ సభ్యుడు అల్తాఫ్, కుర్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్కంటి బుచ్చయ్య, బీఆర్ఎస్ రామారెడ్డి మండల అధ్యక్షుడు రంగు రవీందర్ గౌడ్, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ కాసర్ల రాజేందర్ పటేల్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పడిగెల శ్రీనివాస్ గుప్తా, రామారెడ్డి ఉప సర్పంచ్ ప్రసాద్ గుప్తా, బీఆర్ఎస్ సదాశివనగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు పెసరి సాయిలు, ఎంపీటీసీలు జయశ్రీ, సుజాత, రేణుక తదితరులు పాల్గొన్నారు.
బండి సంజయ్పై గాంధారి పోలీస్స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఇన్చార్జి ఎస్సై రాజారామ్నకు ఫిర్యాదు చేశారు. సంజయ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్నాయక్, ఎంపీపీ రాధాబలరాం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శివాజీరావు, గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్, గాంధారి విండో చైర్మన్ పెద్దబూరి సాయికుమార్, ఎంపీటీసీలు పత్తి శ్రీనివాస్, పరిగెన్బాయి హేమ్లానాయక్, గంగామణి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి రూరల్/బాన్సువాడ టౌన్, మార్చి 11: ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో బండి సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు సొసైటీ అధ్యక్షుడు ఏగుల నర్సింహులు, నాయకులు శ్రావణ్కుమార్, బాల్రాజ్గౌడ్, మామిడి దామోదర్, జగన్గౌడ్, ఎరుకల సాయిలు, లింగం, సాయిలు, ముజ్జు, సాతెల్లి కిష్టయ్య, రాజయ్య తదితరులు ఉన్నారు.
బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకమిటీ చైర్మన్ మోహన్నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు లింగమేశ్వర్, రాజేశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు రమాదేవి, వెంకటేశ్, శ్రీనివాస్, కిరణ్కుమార్, ఆమెర్, అహ్మద్, నాయకులు ఎజాస్, గోపాల్రెడ్డి, వాహబ్, దాసరి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
పిట్లం, మార్చి 11: తెలంగాణ ఆడపడుచు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని జాగృతి పిట్లం మండల అధ్యక్షురాలు మంజుల డిమాండ్ చేశారు. పిట్లంలో ఆమె శనివారం విలేకరులతో మాట్లాడారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ కోసం ఢిల్లీలో దీక్ష చేసిన కవితను చూసి ఓర్వలేక బండి సంజయ్ ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు. తెలంగాణ ఆడపడుచుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. మహిళల జోలికి రావొద్దన్నారు.