బోధన్, నవంబర్ 9: రాష్ట్రంలోనే కాకుండా దేశమంతటా పింక్ వేవ్ నడుస్తున్నదని, బీఆర్ఎస్ను రాష్ట్ర ప్రజలతోపాటు దేశంలోని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బోధన్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ నామినేషన్ మహోత్సవ ర్యాలీలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఆమె మాట్లాడారు. కేసీఆర్ను మూడోసారి సీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్కు ఘనవిజయం లభించబోతున్నదని అన్నారు. బోధన్లో జరిగిన ర్యాలీ.. విజయోత్సవ ర్యాలీని తలపించిందని అన్నారు. ర్యాలీకి నియోకవర్గంలోని జనం కదలివచ్చారని, వారి ఉత్సాహాన్ని చూస్తుంటే మహ్మద్ షకీల్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమనేది స్పష్టమైందన్నారు. బోధన్లో కొందరు సీనియర్ నాయకులు ఉన్నారని, వారు ప్రజల కోసం చేసిందేమీలేదని ప్రతిపక్షాల అభ్యర్థులను ఉద్దేశించి విమర్శించారు. షకీల్ సీనియర్ నాయకుడు అయినప్పటికీ అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తని, గత రెండు పర్యాయాలు ఆయన ప్రజల ప్రేమాభిమానాలను పొందారన్నారు. ఈ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి షకీల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని, తద్వారా కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు.
బోధన్ నియోజవర్గ ప్రజలు బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం ఉన్నదని, ప్రతిపక్షాల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదని బోధన్ అభ్యర్థి మహ్మద్ షకీల్ అన్నారు. నామినేషన్ ర్యాలీకి నియోజకవర్గంలోని ప్రజలంతా తరలిరావడం చూస్తుంటే తన గెలుపు వన్ సైడేనని తేలిపోయిందన్నారు. తనకు బీఆర్ఎస్ టిక్కె ట్ ఇచ్చి మూడోసారి ఎమ్మెల్యేను చేస్తున్నందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎ మ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతి మా, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గోగినేని నరేంద్రబాబు, రవీందర్ యాదవ్, న్యాయవాదు లు వెంకటేశ్వరరావు దేశాయ్, ఆబిద్, జి. శ్యామ్రావు, మహిమూద్ పాల్గొన్నారు.