బీబీపేట్, డిసెంబర్ 3: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, (పాఠశాల పూర్వ విద్యార్థి)తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి తన సొంత డబ్బులు రూ.6 కోట్లతో ఆధునిక హంగులతో పాఠశాల భవనాన్ని నిర్మించారు. పాఠశాల భవన నిర్మాణ పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి శంకుస్థాపన చేయగా.. గతేడాది నవంబర్లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పాఠశాలను ప్రారంభించారు. పాఠశాలకు తిమ్మయ్యగారి సుశీల-నారాయణరెడ్డి బాలుర ఉన్నత పాఠశాలగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. శనివారం నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరై మాట్లాడారు. పూర్వ విద్యార్థి తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి శిథిలావస్థలో ఉన్న పాఠశాలను నూతన హంగులతో నిర్మించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, మధ్యప్రదేశ్ ‘ఎంఎస్ ఎంఈ’ కమిషనర్ అండ్ సెక్రటరీ నర హరి దంపతులు, ప్రముఖ గాయకుడు మిట్టపల్లి సురేం దర్, డీఈవో రాజు, పాఠశాల నిర్మాణ దాత తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మలావత్ పూర్ణ, ఎంపీపీ బాలమణి, వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి, సర్పంచ్ తేలు లక్ష్మీ సత్యనారాయణ, ఎంపీటీసీలు పల్లవి, కొరివి నీరజ, వార్డు సభ్యురాలు లత, హెచ్ఎం పద్మిని, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.