వినాయక్నగర్, మార్చి 28: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు, మరో యువతి నిర్మల్ జిల్లా పరిధిలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బాసర రైల్వే స్టేషన్ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన మేరకు వివరాలు.. నగరంలోని కోటగల్లికి చెందిన సూరం శ్రీకాంత్ (28) స్థానిక వినాయక్నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాడు. సీతారాంనగర్ కాలనీకి చెందిన నందిత(20) ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ (ద్వితీయ) చదువుతోంది. వీరిద్దరూ కలిసి బుధవారం రాత్రి బాసర రైల్వేస్టేషన్లోని ఓ ఫ్లాట్ఫాం మీద కూర్చొని ఉన్నారు.
నర్సాపూర్-నాగర్సోల్ ఎక్స్ప్రెస్ రైలు బాసర స్టేషన్కు చేరుకోగానే ఇద్దరు రైల్వే ట్రాక్పై దూకేశారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. మృతిచెందిన వారి వద్ద ఉన్న ఆధారాలను సేకరించి వారి కుటుంబీకులకు సమాచారం అందజేశారు. గురువారం ఇద్దరి కుటుంబ సభ్యు ల ఫిర్యాదుమేరకు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు.