భీంగల్: భీంగల్ లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి వేద పండితులు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కొందరు భక్తులని ఆలయంలోని ఏర్పాట్ల గురించి అడిగారు ప్రశాంత్ రెడ్డి. అందుకు వాళ్లు ఆలయంలో డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, ఆలయ సుందరీకరణ వంటి ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రథోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.