బాన్సువాడ రూరల్, మార్చి 12: అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తున్నది రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని చిన్నరాంపూర్ గ్రామ హనుమాన్ మందిరంలో మండప నిర్మాణానికి ఆయన ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నిధుల మంజూరు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ కోరిన వెంటనే అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. గ్రామంలో మసీదు అభివృద్ధి పనులకు రూ.పది లక్షలు, ఈద్గా వద్ద ప్రహరీ కోసం రూ.ఐదు లక్షలు, హిందూ శ్మశాన వాటికలో మెటల్ రోడ్డుకు రూ.మూడు లక్షలు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
మంజూరైన నిధులతో జూన్ వరకు పనులు పూర్తి చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా.. తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరీరేఖ, వైస్ ఎంపీపీ హరిసింగ్, ఉపసర్పంచ్ షేక్ అజీమ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్నాయక్, నాయకులు పర్వగొండ, మోహన్రెడ్డి, అజీజ్, శ్రీనివాస్రెడ్డి, అంజయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.