నిజామాబాద్ సిటీ : కొవిడ్ సమయంలోనూ ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాస్ ద్వారా బోధించడం వల్లే పదవతరగతిలో మంచి ఉత్తీర్ణత శాతం వచ్చిందని ఎమ్మెల్సీ వీజీగౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్హాల్లో పీఆర్టీయూ టీఎస్ 34వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం రెండో రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా సీఎం కేసీఆర్ పీఆర్సీని ప్రకటించి అమలు చేశారని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు.
అనంతరం పీఆర్టీయూ నాయకులు వీజీగౌడ్ను శాలువాతో సన్మానించారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా మహిళ ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలు పాడుతు, ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్గౌడ్, రాష్ట్ర, జిల్లా, మండల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.
పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీపాల్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కమలకర్రావు, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూర రఘొత్తమరెడ్డి , జనార్దన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ సమక్షంలో ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శుల చేత ప్రమాణస్వీకారం చేయించారు.