గృహజ్యోతి పథకానికి అర్హత ఉన్నా.. జీరో బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రజాపాలన సేవా కేంద్రాలకు తరలివస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని మెప్మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరాగా..
స్థానిక సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంపై మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సైతం ఇదే తీరు కనిపిస్తున్నది. ప్రతిరోజూ సేవా కేంద్రానికి వందల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారు. జీరో బిల్లు రాకపోవడంతో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.