బాన్సువాడ, జూలై 29 : మొదటిసారి తాను ఎమ్మెల్యే అయినప్పుడు బాన్సువాడ డివిజన్ కేంద్రంలో ఒకేఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండేదని, ప్రస్తుతం నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మార్చానని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని కొత్తబాదిలో రూ. కోటీ 30లక్షలతో కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల వసతి గృహం, మోడల్స్కూల్ ల్యాబ్, రూ.15 లక్షలతో నిర్మించిన కస్తూర్బా పాఠశాల ప్రహరీ, రూ.కోటీ 44లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ స్కూల్ బాలికల వసతిగృహాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ, బాలుర, బాలికల, కో-ఎడ్యుకేషన్ కళాశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలో మొత్తం 12 ఫుడ్ సైన్స్ కళాశాలలు ఉండగా, రాష్ర్టానికి 13వ కళాశాల నియోజకవర్గంలోని రుద్రూర్లో ఏర్పాటు చేశామశాన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడకు బీఎస్సీ నర్సింగ్ కళాశాలను మంజూరు చేయించామన్నారు.
బాన్సువాడలో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాష్ట్రంలోని పది టాప్ టెన్ కళాశాలల్లో ఒకటని ఆయన తెలిపారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థి దశలోనే లక్ష్యాలన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేలా విద్యార్థులను ఉపాద్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏటా రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థిపై రూ.లక్షా 25 వేలు ఖర్చు చేస్తూ.. విద్యార్థులకు పుస్తకాలు, మౌలికవసతులు, నాణ్యమైన బోధన, విద్య అందించేందుకు కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపారు. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 20 వేల పరిశ్రమలకు టీఎస్ ఐపాస్ ద్వారా పర్మిషన్లు ఇచ్చారని , దాంట్లో 16 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా ఐటీ రంగంలో 6 లక్షల మంది పనిచేస్తున్నారని, వారు మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు సాధించారని తెలిపారు.
ప్రతిభ తోనే అనుకున్న ఉద్యోగాన్ని సాధించవచ్చని తెలిపారు. తమ వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడితే ఉపాధ్యాయులకు ఎంతో ఆనందం ఉంటుందన్నారు. అనంతరం స్పీకర్ పోచారంను ఉపాధ్యాయులు, సిబ్బంది సన్మానించారు. పలువురు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ జాయింట్ కలెక్టర్ కె.చంద్రమోహన్, ఆర్డీవో రాజాగౌడ్, జిల్లా జెండర్ కో-ఆర్టినేటర్ ఉమారాణి , ఇరిగేషన్ ఎస్ఈ వాసంతి, ఈఈ రమ, ఎంఈవో నాగేశ్వర్రావు, ఎంపీవో సత్యనారాయణరెడ్డి, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, జడ్పీటీసీ పద్మాగోపాల్రెడ్డి, నాయకులు కొత్త్తాబాది రమేశ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్నాయక్, గోపాల్రెడ్డి, హనుమాన్ వ్యాయామశాల అధ్యక్షుడు గురు వినయ్కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు అంకితాసాయాగౌడ్, జిన్న రఘురామయ్య, ఎంపీటీసీ సునీతామల్లారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, బస్వయ్య, సలీం, జీవన్, కస్తూర్బా ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజారెడ్డి, డీఈ జగదీశ్, ఏఈ గజేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.