బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ దుకాణాల సముదాయ సభ్యులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు శాసన సభాపతిని శుక్రవారం కలిసి ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందజేశారు. అన్ని విధాలా అండగా ఉంటున్న పోచారానికే ఓటేస్తామని స్పష్టం చేశారు. స్పీకర్ ఎన్నికల ఖర్చు కోసం తమ యూనియన్ తరఫున రూ. 11వేలు అందజేశారు. తనకు మద్దతు ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిరీ పోచారం శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
వేల్పూర్ మండలంలో మంత్రి ప్రశాంత్రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జాన్కంపేట్ గ్రామంలోని సర్వసమాజ్, గంగపుత్ర సంఘ సభ్యులు మంత్రి వెంటే ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేసి వేములకు అందజేశారు.