నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 23 : జిల్లాలో నేరాల సంఖ్య పెరిగిందని నిజామాబాద్ జిల్లా జడ్జి కె.సునీత అన్నారు. జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వార్షిక సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలపై జరిగే నేరాలను నిర్మూలించాలంటే చట్టాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. మహిళలపై జరిగే నేరాల్లో పోలీసు శాఖ నుంచి ఏ విధంగా సహాయం అందుతుంది.. న్యాయ శాఖ నుంచి ఎలాంటి ఊరట లభిస్తుందనే విషయాలు తెలుస్తాయన్నారు. షీ టీముల సహకారంతో అవగాహ న కార్యక్రమాలు నిర్వహించాలని, డ్రగ్స్ కేసులు ఈ మధ్య చాలా నమోదవుతున్నాయన్నారు. యువ త బంగారు భవిష్యత్ను కోల్పోకుండా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అన్ని శాఖల కృషితోనే నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దగల్గుతామని అన్నారు.
ఈ రోజుల్లో సమన్వయం అనేది చాలా అవసరం అని, పోలీసు, రెవెన్యూ శాఖలే కా కుండా ఇతర శాఖల సహకారం కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. పోలీసులు 24/7 విధులు నిర్వహిస్తారని, ఎక్కడ శాంతి భద్రతలు బాగుంటే అక్కడ ప్రభుత్వం బాగుంటుందన్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు డీజీపీ ఆదేశాలతో రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ అనేది అమలులో ఉందని అన్నారు. పోలీస్ వ్యవస్థలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయని, సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను పరిష్కరిస్తున్నామన్నా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్ర, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్బాబు, జిల్లా ఫారెస్టు అధికారి వికాస్ మీనా, జిల్లా లీగల్ సెషన్స్ అథారిటీ పద్మావతి, డీటీసీ కె.వెంకటరమణ, బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జగ్గారామ్, ట్రాన్స్ కో ఎస్ఈ ఆర్.అవీందర్, డీఎం హెచ్వో డాక్టర్ సుదర్శనం, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రఘురాజ్, ఆర్టీసీ డిపో మేనేజర్ ఆనంద్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, ఎస్బీఐ మేనేజర్ విశ్వనాథ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీసీఎస్, ట్రాఫిక్, ఏఆర్, హోంగార్డ్స్ ఏసీపీలు వెంకటేశ్వర్, ప్రభాకర్ రావు, కిరణ్కుమార్, రమేశ్, నారాయణ, సంతోష్, శ్రీనివాస్, ఎస్బీఐ శ్రీశైలం, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.