వినాయక్నగర్, మార్చి 23 : నిజామాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పోక్సో, ఎన్డీపీఎస్ చట్టాలపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధానన్యాయమూర్తి సునీత కుంచాలతోపాటు అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ పద్మావతి హాజరై వివిధ శాఖల అధికారులకు ఆయా చట్టాలపై అవగాహన కల్పించారు.
హైదరాబాద్కు చెందిన సీనియర్ న్యాయవాది గోపాలకృష్ణ గోఖలే సెకండ్ సెషన్లో ఎన్డీపీఎస్ చట్టంపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మెజిస్ట్రేట్ కుష్బూ ఉపాధ్యాయ, దీప్తి, గోపికృష్ణ, శ్రీనివాస్, ట్రైనీ ఐపీఎస్ చైతన్యారెడ్డి, ఏఎస్పీ శిషాద్రి, న్యాయసంస్థ, పోలీస్ శాఖ, చైల్డ్ వెల్పేర్, సఖీ సెంటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ తదితరులు పాల్గొన్నారు.